
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ విజేతగా ఆదిలాబాద్
● వరంగల్ జట్టుపై జయకేతనం
ఆదిలాబాద్: ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల హ్యాండ్బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల 8నుంచి నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో వరంగల్ జట్టుపై ఆది లాబాద్ జట్టు ఘన విజయం సాధించినట్లు కోచ్ అరవింద్, మేనేజర్లు స్పూర్తి, వివేక్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవడంపై డీఈవో ప్రణీత, ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి రమేశ్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్, హరిచరణ్ తదితరులు అభినందనలు తెలిపారు.