దోపిడీ చేస్తున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

దోపిడీ చేస్తున్నాయి..

Jun 19 2025 4:24 AM | Updated on Jun 19 2025 4:24 AM

దోపిడ

దోపిడీ చేస్తున్నాయి..

ప్రైవేటు విద్యాసంస్థలు ఐఐటీ, నీట్‌ పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నా యి. ఇంటర్మీడియట్‌ తర్వాత బోధించాల్సిన సబ్జెక్టులను ఇప్పుడు బోధిస్తూ.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు.

– ప్రశాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

తనిఖీలు నిర్వహించాలి..

ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు నిలిపివేయాలి. అనుమతులు లేకుండా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పాఠశాలల అనుమతులను రద్దు చేయాలి. జడ్చర్లలోని ఓ స్కూల్‌లో నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాలను పట్టుకున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలి.

– సతీశ్‌, ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌, మహబూబ్‌నగర్‌

రెండు పాఠశాలల్లో

పుస్తకాలు సీజ్‌

బాలానగర్‌ గీతాంజలి, జడ్చర్ల శ్లోక పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతుండగా పట్టుకొని సీజ్‌ చేయాలని ఎంఈఓలకు ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలను విక్రయించొద్దు. పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు ఎంఈఓలకు కలెక్టర్‌ పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాస్థాయిలో తనిఖీలకు ఒక కమిటీ ఏర్పాటుకు కలెక్టర్‌కు నివేదించాం. త్వరలో పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం.

– ప్రవీణ్‌కుమార్‌, డీఈఓ, మహబూబ్‌నగర్‌

దోపిడీ చేస్తున్నాయి.. 
1
1/2

దోపిడీ చేస్తున్నాయి..

దోపిడీ చేస్తున్నాయి.. 
2
2/2

దోపిడీ చేస్తున్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement