
నైపుణ్యం ప్రదర్శించడానికే డ్యూటీ మీట్
మహబూబ్నగర్ క్రైం: ఈ ఏడాది నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో ప్రధానంగా ఆరు ఈవెంట్స్ ఉంటాయని.. పోటీలో ఉండే వారు సత్తా చాటేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో పోలీస్ డ్యూటీ మీట్–2025 జూలైలో వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న క్రమంలో వాటిలో పాల్గొనే జోగుళాంబ జోన్–7 కోసం జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని బుధవారం పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. పోలీస్ డ్యూటీ మీట్లో ఆరు అంశాలు సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్వెస్టిగేషన్, విధ్వంస నిరోధక తనిఖీ, డాగ్ స్క్వాడ్ పోటీ, కంప్యూటర్ అవగాహన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉంటాయని తెలిపారు. డ్యూటీ మీట్ అనేది ఒక వినూత్నమైన వేదిక అని, పోలీస్ వ్యవస్థలోని ప్రతిభావంతులైన అధికారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించడానికి శారీరక దారుఢ్యం కంటే మానసిక ధైర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి క్రమశిక్షణతో నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ పోటీలలో జిల్లా జట్టు ఉత్తమ ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఎంపికై న పోలీసులు రాష్ట్రస్థాయిలో జరిగే జోనల్స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.