‘కురుమూర్తి’కి మహర్దశ | - | Sakshi
Sakshi News home page

‘కురుమూర్తి’కి మహర్దశ

Jun 16 2025 7:01 AM | Updated on Jun 16 2025 7:01 AM

‘కురు

‘కురుమూర్తి’కి మహర్దశ

చిన్నచింతకుంట: ఉమ్మడి జిల్లాలో పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై ఘాట్‌ రోడ్‌ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. అధికారులు శనివారం ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి స్థలాన్ని పొక్లెయిన్‌తో చదును చేయించారు. అలాగే ఆలయ పరిసరాల్లో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి ఉద్దాల మండపం స్వామి వారి పాదుకల వరకు 20 పిల్లర్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌.. అక్కడి నుంచి స్వామివారి ప్రధాన ఆలయం, కురుమూర్తి గిరుల వెనకభాగం నుంచి అమ్మాపురం సమీపంలోని ఆత్మకూర్‌, దేవరకద్ర ప్రధాన రహదారి వరకు ఘాట్‌ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం 2.850 మీటర్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పుతో డబుల్‌ లైన్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది. రోడ్డు నిర్మాణంతో భక్తులకు స్వామివారి దర్శనం సులభమవుతుంది.

భక్తుల సౌకర్యార్థం..

అమావాస్య, ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆయా సమయాల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సహకారంతో ఆలయ అధికారులు ప్రస్తుతం ఆలయం వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌, ఘాట్‌రోడ్డు నిర్మాణం, స్వామివారి ప్రధాన ఆలయం ఎదుట మహా మండపం, రాజగోపురం ఎదుట పీఎస్‌బీ షెడ్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ ప్రత్యేక నిధులతో తాగునీటి ట్యాంకు నిర్మించారు. కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాల నిర్మాణానికిగాను ఆలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు.

ఎమ్మెల్యే సహకారంతో..

ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సహకారంతో కురుమూర్తిస్వామి ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం రూ.110 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌, ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. అంతేగాక ఆలయం వద్ద మహా మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నాం.

– గోవర్ధన్‌రెడ్డి, చైర్మన్‌,

కురుమూర్తిస్వామి ఆలయం

త్వరగా పూర్తి చేస్తాం..

కురుమూర్తిస్వామి ఆలయం వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ ఘాట్‌రోడ్డు పనులు ప్రారంభించాం. ఆయా పనులకు రెండేళ్ల అగ్రిమెంట్‌ ఉంది. అంతలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

– సంధ్య, డీఈఈ, ఆర్‌అండ్‌బీ

రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు

ఎలివేటెడ్‌ కారిడార్‌ ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన అధికారులు

‘కురుమూర్తి’కి మహర్దశ 1
1/2

‘కురుమూర్తి’కి మహర్దశ

‘కురుమూర్తి’కి మహర్దశ 2
2/2

‘కురుమూర్తి’కి మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement