
చేపలు పట్టేందుకు వెళ్లి న్యాయవాది మృతి
జడ్చర్ల: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ న్యాయవాది ప్ర మాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం జడ్చర్ల మినీ ట్యాంక్బండ్ నల్లచెరువులో జరిగింది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక కావేరమ్మపేటకు చెందిన న్యాయవాది గుండు తిరుపతయ్య(55) ఆదివారం మినీ ట్యాంక్బండ్ వద్ద చేపలు పట్టే క్రమ ంలో కాలుజారి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డా డు. ఈ క్రమంలో కణతకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించి స్థానికులు నీటి నుంచి బయటకు తీసేలోగా మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భవనంపై నుంచి దూకి వివాహిత బలవన్మరణం
జడ్చర్ల: మూడంతుస్తుల భవనంపై నుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బాదేపల్లి పట్టణంలో చోటుచేసుకున్నది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. బాదేపల్లికి చెందిన అనూష(30) భర్త ఆంజనేయులు, తన ముగ్గురు పిల్లలతో కలిసి స్థానిక 4వ వార్డులోని మాధవరావు కాంపౌండ్లోని ఓ భవనంలో అద్దెకు ఉంటుంది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై భవనంపై నుంచి కిందకు దూకడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. డబ్బుల కోసం భర్త వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఆరోపించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
మరికల్: తామర పూలను కోసేందుకు చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం పెద్దచింతకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన బీరప్ప, మల్లమ్మ దంపతుల కుమారుడు మల్లేష్ (42) నిత్యం శివుడి పూజకు తామరపూలను తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పూజకు తామరపూలు కోసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులోపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు.
ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
వెల్దండ: మండలంలోని నారాయణపూర్తండాలో ఇస్లావత్ శిరీష(19)నీట్లో సీట్ రాలేదని ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇస్లావత్ పాండు, చిట్టికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా.. నీట్లో సరైన మార్కులు సాధించలేదు. శనివారం వెలువడిన ఫలితాల్లో మార్కులు తక్కువ రాగా.. మానస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.

చేపలు పట్టేందుకు వెళ్లి న్యాయవాది మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి న్యాయవాది మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి న్యాయవాది మృతి