
కృష్ణానదిలో మునిగిన పంటలు
పెంట్లవెల్లి: మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతం మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, వే ముకల్ గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం కృష్ణా నది తీరాన వందలాది ఎకరాలు నువ్వులు, మినుములు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఎ ప్పటిలాగే పలు రకాల పంటలు కృష్ణానది తీరంలో ఒండ్రుమట్టి పొలాల్లో సాగు చేశారు. ఈ పొలాలు కృష్ణానది నీరు తీసిన తర్వాత పంటలు సాగు చేస్తా రు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పంటలు సాగు చేశారు. కానీ ఈ సంవత్సరం మందస్తుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు కృష్ణానది నీరు ప్రవహిస్తోంది. దీంతో వందల ఎకరాల పంటలు నీటిలో మునుగుతున్నాయి. కోసిన పంటల కుప్పలు రాల్పడానికి రోజూ వర్షాలు పడడంతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. మరో వైపు చేతికి వచ్చిన పంట నీళ్లలో మునిగిపోతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు ఎకరా సాగు చేయడానికి కౌలుతో కలిపి రూ.60 వేలు అవుతోంది. అలా 5, 10 ఎకరాలు సేద్యం చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రైతులు నీటిలో మునుగుతున్న పంటను ట్రాక్టర్ల ద్వారా కూలీలతో నీటిలో నుంచి బయ టకు తీసుకొస్తున్నారు.
నీట మునిగిన పంటలు
నదిపరివాహక ప్రాంత రైతులు పాట్లు

కృష్ణానదిలో మునిగిన పంటలు