
బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
కొత్తకోట రూరల్: బైక్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్కు చెందిన మణికంఠ చిత్తూర్ జిల్లా మదనపల్లికి చెందిన ఓ యువతితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. అత్తగారి ఇంటి నుంచి భార్యను, బామర్ది, అత్త, తల్లితో కలిసి మణికంఠ ఆదివారం ఉదయం మదనపల్లి నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. కొత్తకోటకు చెందిన రాధమ్మ, కుమారుడు కళ్యాణ్కుమార్రెడ్డి బైక్పై పెబ్బేరు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి కొత్తకోటకు వస్తుండగా ఎన్హెచ్44 మదర్థెరిస్సా జంక్షన్ సమీపంలో పట్టణంలోకి మలుపుతుండగా.. అటు నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుకు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. బైక్ సైతం అదపు తప్పి కింద పడటంతో కళ్యాణ్కుమార్రెడ్డి, రాధమ్మకు గాయాలయ్యాయి. కారులో ఉన్న ఐదుగురికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు