ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు

Jun 16 2025 7:01 AM | Updated on Jun 16 2025 7:01 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు

జడ్చర్ల: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్‌కు మధ్య గొడవ జరగగా చివరకు పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు చేరిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటు చేసుకుంది.సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. హైదరాబాద్‌–2 ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కొల్లాపూర్‌ బయలుదేరింది. జడ్చర్లలోని శ్రీనివాస కాలనీకి చెందిన అనసూయ అనే ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కింది. బస్సు ఫుట్‌బోర్డుపై నిలబడడంతో బ్రేక్‌ వేస్తే కింద పడిపోయే ప్రమాదముందని డ్రైవర్‌ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఒక్కసారిగా డ్రైవర్‌పై మండిపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో బస్సును మార్గమధ్యలోని పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆపి పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పోలీసులు ఇద్దరిని విచారించి బస్సును పంపించి వేశారు.

మోదీపూర్‌లో ట్రాక్టర్‌ చోరీ

కోయిల్‌కొండ: మండల పరిధిలోని మోదీపూర్‌ గ్రా మానికి చెందిన మైపాల్‌గౌడ్‌కు చెందిన ట్రాక్టర్‌ శనివారం రాత్రి చోరీకి గురైంది. రైతు మైపాల్‌గౌడ్‌ 15 రోజుల క్రితం రూ.12 లక్షలు పెట్టి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల అనంతరం తన కిరాణషాపు ముందు నిలబెట్టాడు. ఉదయం లేచి చూసేసరికి ట్రాక్టర్‌ కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాజీ తెలిపారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు 
1
1/1

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement