పొక్లెయిన్‌ నుంచి కింద పడి వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పొక్లెయిన్‌ నుంచి కింద పడి వ్యక్తి దుర్మరణం

Jan 17 2024 12:48 AM | Updated on Jan 17 2024 1:09 PM

- - Sakshi

గోవింద్‌మధు (ఫైల్‌)

బల్మూర్‌: పండుగ వేడుకలో పొక్లెయిన్‌ కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బల్మూర్‌ మండలంలోని జిన్‌కుంటలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీశైలం తన పొక్లెయిన్‌ను సంక్రాంతి సందర్భంగా గ్రామ సమీపంలోని ఈదమ్మ ఆలయం చుట్టూ తిప్పడానికి వెళ్లాడు.

అదే సమయంలో పొక్లేయిన్‌ బ్లేడ్‌లో గ్రామానికి చెందిన మధు(40)ను కూర్చోబెట్టుకున్నాడు. మధు కింద పడిపోగా.. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. అతని పైనుంచి టైర్‌ వెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి మృతుదేహానికి పోస్టు మార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి వివరించారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement