డ్రంకెన్‌ డ్రైవ్‌లో 18 మందికి జరిమానా | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 18 మందికి జరిమానా

Mar 29 2023 1:16 AM | Updated on Mar 29 2023 1:16 AM

డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న పోలీసులు   - Sakshi

డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌ క్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు నగదు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు రెండు రోజుల పాటు జిల్లాకేంద్రంలో చేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 19మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని మంగళవారం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి డి.నిర్మల 18 మంది వాహనదారులకు రూ.44 వేలు జరిమానా విధించగా, ఒకరికి రూ.2,000 జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ అశోక్‌ మాట్లాడుతూ వాహనదారులు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు ఎంతో నష్టపోతాయని తెలిపారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఒక వాహనదారుడికి ఐదు రోజుల జైలు శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement