
స్టార్ హోటల్ లుక్తో మోడల్ రన్నింగ్ రూం.. ●
● నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎం
చేతుల మీదుగా ప్రారంభం
కాజీపేట రూరల్ : రైల్వే శాఖ కాజీపేట జంక్షన్లో మెన్, ఉమెన్ లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం మోడల్ రన్నింగ్ రూంను స్టార్ హోటల్ లుక్తో నిర్మించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సకల సౌకర్యాలతో నిర్మించిన మోడల్ రన్నింగ్ రూం భవన సముదాయాన్ని శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట స్టేషన్ ఎదుట గల పాత రన్నింగ్ రూం స్థానంలో ఈ మోడల్ రన్నింగ్ రూంను నిర్మించారు. సుమారు రూ. 7.50 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్ లుక్తో 57 గదులు, 140 బెడ్ల సౌకర్యంతో నిర్మించిన ఈ భవన సముదాయంలో మెన్, ఉమెన్ ఎల్పీలు, ఎల్పీలు, ట్రైన్ మేనేజర్లు వేర్వేరుగా ఉండేందుకు సకల సదుపాయాలు కల్పించారు. కాజీపేట రైల్వే లోకోపైలెట్ కార్యాలయం కేంద్రంగా కాజీపేట–సికింద్రాబాద్, విజయవాడ, బల్లార్షా రూట్లో విధులు నిర్వహించే ఆన్లైన్ రన్నింగ్స్టాప్ ఈ రన్నింగ్ రూం భవనంలో విశ్రాంతి తీసుకుంటారని అధికారులు తెలిపారు.