
యోగాలో అష్టాంగ మార్గాలు..
భారతదేశం యోగాకు అంబాసిడర్. క్రీస్తుశకం 4వేల సంవత్సరంలో ఉత్తర భారత దేశానికి చెందిన పతంజలి మహర్షి యోగా శాస్త్రంలో నిబంధనలు జోడించారు. మానవుల ఆరోగ్యం కోసం క్రమ పద్ధతిలో యోగాను గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాలను మహర్షి మహోష్ యోగి వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. పతంజలి మహర్షి యోగాలో అష్టాంగ మార్గాన్ని రూపొందించి, ఇందులో మయం, నియమమం, ఆసనం, ప్రాణామాయం, ప్రత్యాహం, ధ్యానం ధారణం, సమాధి సూత్రాలను ప్రపంచానికి అందించారు. ఇందులో మయం, నియమం, ఆసనం, ప్రాణామాయాలను హట యోగాంగా వర్ణించారు. బాహ్య శరీరాన్ని క్రమబద్ధీకరించడంలో ఇవే మూల ఆసనాలు. ఎక్కువ సమయం లేని వారు కనీసం 20 నిమిషాలు సూర్యనమస్కార ఆసనాలతో పాటు ప్రాణామాయం చేస్తే సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు, పక్షవాతం, చర్మవ్యాధులు, మైగ్రేన్ లాంటి వ్యాధుల నివారణకు యోగా ఉపయోగపడుతుంది.