
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాకు అంబాసిడర్ ‘భారతదేశం’
● ఐరాసలో 177 దేశాల మద్దతు
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
పోటీ ప్రపంచంలో జీవనం ఉరుకులు, పరుగుల మయమైపోయింది. సమయానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వృత్తిపర, వ్యక్తిగత ఒత్తిళ్లు.. వెంటాడుతున్న కాలుష్య భూతంతో ధరిచేరే రోగాలు.. వెరసి ఏది చేద్దామన్నా ఇబ్బందే. వీటన్నింటి నుంచి ఉపశమనానికి యోగా చక్కటి ఔషధమని నిపుణులు శాసీ్త్రయంగా నిరూపించారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాకు విశేష ప్రాముఖ్యత కల్పిస్తూ వచ్చారు. ఆయన చొరవతోనే ఐక్యరాజ్యసమి తి.. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నాడే తీర్మానించింది. ఈ నేపథ్యంలో నేడు యోగా డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
మినీ స్టేడియంలో
యోగా దినోత్సవం
పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నేడు ఉదయం 7 గంటలకు యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినం. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొనాలి. ప్రస్తుత జీవనశైలిలో మానసిక ఒత్తిడిని అధిగమించడం, ఆరోగ్యం మెరుగు పరచుకోవడానికి యోగా దివ్యఔషధం. అందుకే ప్రతీ ఒక్కరు రోజు వారీగా యోగాసనాలు వేయాలి.
రిజ్వాన్ బాషా, కలెక్టర్, జనగామ
●
–జనగామ/ పాలకుర్తి టౌన్

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం