
నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తిపై తొలిసారి పీడీ యాక్టు
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించిన వ్యక్తిపై రాష్ట్రంలో తొలిసారి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేశారు. మట్టెవాడకు చెందిన ఇరుకుళ్ల వేద ప్రకాశ్పై సీపీ జారీ చేసిన పీడీ యాక్టు ఉత్తర్వులను శుక్రవారం మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి నిందితుడికి పరకాల జైలులో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడు వేదప్రకాశ్ మరో నిందితుడితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. గత నెల 7వ తేదీన రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు నిందితుల నుంచి సుమారు రూ. 49 లక్షల 52 వేల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడు వేదప్రకాశ్ 26వ తేదీన నకిలీ పురుగుల మందులు విక్రయిస్తుండడంతో మట్టెవాడ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. దీంతో నిందితుడిపై సీీపీ సన్ప్రీత్సింగ్ పీడీ యాక్టు నమోదు చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 7799848333 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
కోర్టులో బాంబు కలకలం..
● బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో
జిలెటిన్ స్టిక్స్ లభ్యం
● ఊపిరి పీల్చుకున్న కక్షిదారులు
వరంగల్ లీగల్ : హనుమకొండ ఒకటవ అదనపు సెషన్స్ కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి కోర్టులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకుని శుక్రవారం ఉదయమే కోర్టు సమ యం నుంచి కక్షిదారులు, న్యాయవాదులను తనిఖీ చేసిన అనంతరం కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. కాగా, చాలా సంవత్సరాల (దాదాపు 20 పైగా) క్రితం ఓ క్రిమినల్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న జిలెటిన్ స్టిక్స్ను హనుమకొండ ఒకటవ అదనపు సెషన్స్ కోర్టుకు అందజేశారు. కేసు పరిష్కారమైనా నాడు స్వాధీనం చేసుకున్న ఏడు జిలెటిన్ స్టిక్స్ కోర్టు ప్రాపర్టీ రూంలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఈ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో సంబంధిత కోర్టు ఏడు జిలెటిన్ స్టిక్స్లో ఒకటి నిర్వీర్యం కావడంతో మిగతా ఆరింటిని పోలీసులకు అప్పగించింది. దీంతో కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ 23న కూడా కోర్టులో అనుమానాస్పద సూట్ కేస్ బాంబు కలకలం రేపింది. గతంలో ఉభ య జిల్లాల న్యాయస్థానాల అధికారిక ఈమెయిల్కు తమిళనాడు చెందిన ఓ తీవ్రవాద సంస్థ పేరుతో కోర్టులో బాంబులు పేలుస్తామని మెస్సేజ్ వచ్చింది.

నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తిపై తొలిసారి పీడీ యాక్టు