
సన్న బియ్యంతో సంతృప్తికరంగా భోజనం
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఇష్టంగా తిన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని వెలుగు సోమయ్య ఇంట్లో సన్న బియ్యం అన్నంతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ, స్థానిక నాయకులు ఆమెతో పాటు భోజనం చేశారు. పప్పు, వంకాయ, సాంబారు వంటకాలను ఎమ్మెల్యే ఇష్టంగా తిన్నారు. భోజనం చేసిన ఇంట్లో కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీతో 80శాతం పేదలు ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
విద్యార్థుల సంఖ్య
పెంపునకు కృషి చేయాలి
గార్ల: గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాం నాయక్ ఆదేశించారు. బుధవారం గార్ల మండలం సేరిపురం పంచాయతీలోని మర్రిగూడెం గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. బడిబాటలో నమోదైన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, హాజరు శాతం పెంచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే, ఆ పాఠశాల ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాల స్కూళ్లకు డిప్యుటేషన్పై పంపిస్తామని చెప్పారు. పాఠశాల తరగతి గదులు, కిచెన్షెడ్ను పరిశీలించారు. పాఠశాలలో చేతిపంపు పాడైందని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులు డీడీకి విన్నవించారు. చేతిపంపు మరమ్మతులు చేయిస్తానని డీడీ హామీ ఇచ్చారు. ఎస్సీఆర్పీ మాలోత్ బుచ్చానాయక్, ఉపాధ్యాయులు బాలాజీనాయక్, కబ్బాకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మనుమరాలిని మోడల్
స్కూల్లో చేర్పించిన తాత
కురవి: రిటైర్డ్ టీచర్ కొండబత్తుల ఈశ్వర్కుమార్ తన మనుమరాలిని నేరడ మోడల్ స్కూల్లో బుధవారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడి బిడ్డ(మనుమరాలు) అభిజ్ఞ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఆయన తన మనుమరాలిని నేరడ మోడల్ స్కూల్లో చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.
ఎస్పీని కలిసిన సీఐ
మహబూబాబా ద్ రూరల్: మహబూబాబాద్ టౌన్ సీఐగా విధుల్లో చేరిన గట్ల మ హేందర్ రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలమొక్క అందజేశారు.
కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా
రాజ్కుమార్ కొనసాగింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్కుమార్ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి తన చాంబర్లో రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి రాజ్కుమార్కు ఉత్తర్వులు అందజేశారు.

సన్న బియ్యంతో సంతృప్తికరంగా భోజనం

సన్న బియ్యంతో సంతృప్తికరంగా భోజనం

సన్న బియ్యంతో సంతృప్తికరంగా భోజనం