
పొలాలకు ఎలా వెళ్లాలి
డైవర్షన్ రోడ్డు నిర్మించాలని బ్రిడ్జి వద్ద నిరసన తెలుపుతున్న ముస్మి గ్రామస్తులు
కొత్తగూడ: డైవర్షన్ రోడ్డు నిర్మించకుండా బ్రిడ్జి పనులు చేపడుతున్నారని, తమ పొలాలకు ఎలా వెళ్లాలని మండలంలోని ముస్మి గ్రామస్తులు బుధవారం బ్రిడ్జి వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ముస్మితండా నుంచి దుర్గారం వెళ్లే దారిలో ముస్మి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాడని, డైవర్షన్ రోడ్డు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. బిల్లులు కావడం లేదని పనుల్లో మరింత జాప్యం చేస్తున్నాడని, రైతులు వాగు అవతలి వైపు ఉన్న పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి డైవర్షన్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
డైవర్షన్ రోడ్డు లేక ఇబ్బందులు
బ్రిడ్జి వద్ద ముస్మి గ్రామస్తుల నిరసన