
సైనిక వెల్ఫేర్ ఫండ్కు కేయూ అధ్యాపకుల చేయూత
కేయూ క్యాంపస్: సైనిక వెల్ఫేర్కు ఆర్మెడ్ ఫోర్సెస్ ప్లాగ్డే ఫండ్గా కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అధ్యాపకుల తమ ఒక రోజు బేసిక్ పే రూ. 3లక్షల 7వేల 610( చెక్) బుధవారం తెలంగాణ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్కు అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకుట్) అధ్యక్షుడు బి. వెంకట్రామ్రెడ్డి అందజేశారు. బుధవారం క్యాంపస్లోని అకడమిక్ కమిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో వీసీ కె. ప్రతాప్రెడ్డి,రిజిస్ట్రార్ వి. రామచంద్రం సమక్షంలో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ దేశ భద్రతలో సైనికులు సేవలు చిరస్మరణీయన్నారు. తెలంగాణ రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ రమేశ్కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేకరించిన సైనిక వెల్ఫేర్ ఫండ్ను సైనికుల సంక్షేమం కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ విషయంలో పారదర్శకత, జవాబుదారితనం ఉంటుందన్నారు.కార్యక్రమంలో అకుట్ జనరల్ సెక్రటరీ ఎల్పి. రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
● వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సమక్షంలో ఒక రోజు బేసిక్ పే అందజేత