సొంతింటి కల ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల ఆలస్యం

Jun 19 2025 4:38 AM | Updated on Jun 19 2025 4:38 AM

సొంతి

సొంతింటి కల ఆలస్యం

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే జిల్లాలో లబ్ధి దారుల ఎంపిక, మంజూరులో కాస్త జాప్యం జరుగుతోంది. వచ్చిన దరఖాస్తులు, అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించి లెవన్‌ వన్‌ జాబితా తయారీలో ఆలస్యమవుతోంది. ఇందుకు గల కార ణం ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రా యం కుదరడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ముందుకు సాగని ఎంపిక..

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 1,89,065 ధరఖాస్తులు, మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల పరిధిలో 28,526 దర ఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్‌ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ ద్వారా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ..సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా.. ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజమాని, ఇల్లు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేశారు. ఇలా చేసిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా.. ఒక్క ఇందిరమ్మ ఇళ్లకోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబి తాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేని ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరుగా విభజించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి జాబితా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం చేస్తున్నారు.

కమిటీ సభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కీలక భూమిక పోషించే కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఆలోచనతో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో నిజనమైన అర్హులను ఎంపిక చేయడంలో భాగస్వామ్యులై కమిటీ సభ్యుల ఏకాభిప్రాయంతో తుది జాబితా ఇవ్వాలి. అయితే లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా.. తమ అనుచరులకు ఇల్లు రాకపోయినా.. సంతకం పెట్టేందుకు ముందుకు రావడం లేదని ప్రచారం. దీంతో పలు గ్రామాల్లో తుది జాబితా ప్రకటించలేదు. అదే విధంగా తుది జాబితా తయారు చేసిన గ్రామాల్లో ప్రొసీడింగ్‌ ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో లేక కూడా జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఇతర జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండగా మానుకోట లో మాత్రం నెమ్మదిగా జరుగుతున్నా యి. కాగా అధికారులు స్పందించి పనులు వేగంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ముందుకు సాగని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

కమిటీ సభ్యుల మధ్య కుదరని

ఏకాభిప్రాయం

ప్రొసీడింగ్స్‌ ఇవ్వడంలో జాప్యం

జిల్లాలో ఇందిరమ్మఇళ్ల పురోగతి వివరాలు

మండలం ఆమోదం పైలెట్‌ మొదటి ముగ్గు

విడత పోసినవి

బయ్యారం 545 19 74 93

చిన్నగూడూరు 162 18 56 74

దంతాలపల్లి 350 09 114 123

డోర్నకల్‌ 424 18 165 183

గంగారం 165 57 40 97

గార్ల 345 04 07 11

గూడూరు 618 07 158 165

ఇనుగుర్తి 260 15 132 147

కేసముద్రం 422 17 249 266

కొత్తగూడ 239 39 118 157

కురవి 593 03 124 127

మహబూబాబాద్‌ 556 33 152 185

మరిపెడ 575 06 224 230

నర్సింహులపేట 369 41 147 188

నెల్లికుదురు 456 00 70 70

పెద్దవంగర 272 05 40 45

సీరోలు 232 09 91 100

తొర్రూరు 474 00 116 116

మున్సిపాలిటీలు

డోర్నకల్‌ 154 00 68 68

కేసముద్రం 151 00 01 01

మహబూబాబాద్‌ 288 00 00 00

తొర్రూరు 111 00 00 00

మొత్తం 7,761 300 2,146 2,446

వేగంగా ఇళ్ల ముగ్గులు

ప్రొసీడింగ్‌ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ముగ్గులు పోసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామాల్లో పలు స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి. కొందరికి బిల్లులు కూడా అందజేశాం. అన్ని మండలాల్లో పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం.

– కె.రాజయ్య, పీడీ, గృహనిర్మాణశాఖ

సొంతింటి కల ఆలస్యం1
1/1

సొంతింటి కల ఆలస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement