దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలి

Jun 18 2025 3:17 AM | Updated on Jun 18 2025 3:17 AM

దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలి

దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలి

కాజీపేట రూరల్‌/మామునూరు/విద్యారణ్యపురి : దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, ఎయిర్‌ కమొడోర్‌ నర్సింగ్‌ సైలాని అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్‌ ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్‌ సైలానికి వరంగల్‌ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ సచిన్‌ నింబాకర్‌ వీరచక్ర స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల బాధ్యతలు చేపట్టిన నర్సింగ్‌ సైలాని గ్రూప్‌హెడ్‌క్వార్టర్‌లో ఎన్‌సీసీ క్యాడెట్స్‌తో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ల ఎన్‌సీసీ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ రక్షణ కోసం యువత సైన్యంలో పాల్గొనేలా సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్రూప్‌ శిక్షణ విధానాలను పరి శీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పద్ధతులు, క్యాంప్‌ నిర్వహణ, పరిపాలన విధానాలు చూసి అభినందించారు. ఎకై ్సజ్‌కాలనీలోని ఆర్మీ మెస్‌కు వెళ్లి అక్కడ జవాన్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం 10వ తెలంగాణ బెటాలియన్‌, 1వ తెలంగాణ బెటాలియన్‌, 4వ ఎయిర్‌ ఫోర్స్‌ బెటాలియ న్‌, మామునూరు పీటీసీ క్యాంప్‌ను సందర్శించారు. కాగా, నర్సింగ్‌ సైలాని బుధవారం ఖమ్మం బెటా లియన్‌ను సందర్శిస్తారని గ్రూప్‌ కమాండర్‌ సచిన్‌ నింబాకర్‌ తెలిపారు. ఎన్‌సీసీ అధికారులు రాహుల్‌సింగ్‌, ఎస్‌ఎం. రియాజ్‌, కల్నల్‌ పిప్పి కిశోర్‌, కల్న ల్‌ ఎస్‌.ఎస్‌.రామదురై, విజయ్‌కుమార్‌, ‘టి’ వింగ్‌ కమాండర్‌ ఆశీష్‌ భాస్కర్‌, ‘డి’ వింగ్‌ కమాండర్‌ వి.కె.ఆర్య, కల్నల్‌ రవీంద్రకుమార్‌, లెఫ్టినెంట్‌ రవి సునారి, కల్నల్‌ సంజయ్‌కుమార్‌, కల్నల్‌ నవీన్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీలో రాణిస్తే భవిష్యత్‌..

క్రమశిక్షణ, సామాజిక సేవభావంతో ఎన్‌సీసీలో రాణిస్తే క్యాడెట్‌కు భవిష్యత్‌ ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, ఎయిర్‌ కమొడోర్‌ నర్సింగ్‌ సైలాని అన్నారు. ఖిలా వరంగల్‌ మండలం మామునూరులోని పోలీసు శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఎన్‌సీసీ 8వ తెలంగాణ బెటాలియన్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరం మంగళవారం పదోరోజుకు చేరుకుంది. క్యాడెట్లకు బ్యాలెన్స్‌ జంప్‌, వాల్‌జంప్‌, రన్నింగ్‌, డ్రిల్‌, మాప్‌రీడింగ్‌,ఫైరింగ్‌, ఆయుధ శిక్షణ ఇచ్చారు. నర్సింగ్‌ సైలాని ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. సమావేశంలో 8వ బెటాలియన్‌ కమొడర్‌ కల్నల్‌ రవీంద్రకుమార్‌, 615మంది క్యాడెట్లు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల ఎన్‌సీసీ డిప్యూటీ

డైరెక్టర్‌ జనరల్‌ నర్సింగ్‌ సైలాని

వరంగల్‌ ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్‌ సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement