
పత్తి రైతు అభివృద్ధికి తోడ్పాటు అందించాలి
న్యూశాయంపేట: తెలంగాణలో పత్తి రైతు అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాటన్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్కుమార్ గుప్తా, సీసీఐ మార్కెటింగ్ డైరెక్టర్ విజయసేనా, సీసీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీపాణిగ్రహి తదితరులను ముంబాయిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 40లక్షల బేళ్ల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మూడురోజుల్లో డబ్బులు చెల్లించిన నేపథ్యంలో చైర్మన్, తదితరులను సన్మానించినట్లు తెలిపారు. భవిష్యత్లో కూడా ఇదే విధంగా సహకరించాలని ఆయన కోరారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కేయూ క్యాంపస్: టీజీఈసెట్ అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం రెహమాన్, అధ్యాపకులు పాల్గొన్నారు.