
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగులు బాఽధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈ (టెక్నికల్), సేఫ్టీ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు గుర్తించి మార్చాలన్నారు. తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచాలని, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ లైన్లను గుర్తించి మార్చాలన్నా రు. ఈ మేరకు కార్యాచరణ రూ పొందించుకోవాలన్నారు. అధి కారులు తమ సర్కిళ్ల పరిధిలో నిరంతరం అప్రమతంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాల నివా రణపై విస్తృత ప్రచారం కల్పించి వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ సంబంధ పనులు చేయొద్దని, అవసరమైతే 1912కు ఫోన్ చేయాలన్నారు. వీడియో కాన్ఫ రెన్స్లో చీఫ్ ఇంజనీర్లు, రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు.