
సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు కష్టమైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఏ వర్గాలైతే అండగా నిలబడ్డాయో వారందరినీ కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్టీలో కొత్త, పాత కలయికలతో ఇబ్బందులు వస్తున్నాయని, ఆ అంశాల గురించి పార్టీ పరంగా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపా రు. మంత్రివర్గ విస్తరణలో సముచిత న్యాయం కోసం ఎస్సీలోని మాదిగ, మాల వర్గాల వారికి ఏ విధంగా అవకాశం కల్పించారో, అదేవిధంగా ఎస్టీలోని ఆదివాసీలకు అవకాశం కల్పించిన విధంగా లంబాడీలకు అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్నయాదవ్, నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పద్మజ, గుగులోత్ వెంకట్ నాయక్, తోట వెంకన్న, గొల్లపల్లి ప్రభాకర్, చెన్నసీతారాములు, లకావత్ పద్మాబాయి, గుగులోత్ దేవి, భూక్య లక్ష్మి, సంపంగి రామచంద్రు, ముంజాల రాజేందర్ గౌడ్, బానోత్ ప్రసాద్, కొత్త యుగంధర్, మేకల శివ, గాడిపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్