
తండ్రీకొడుకుల విగ్రహాలు ఆవిష్కరణ
డోర్నకల్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకొడుకుల విగ్రహాలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆవిష్కరించారు. మండలంలోని దుబ్బతండాకు చెందిన అజ్మీరా బాల్యాతో పాటు కుమారుడు సాయికుమార్ ఈ నెల 5న ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. వారి జ్ఞాపకార్థం బాల్యా సతీమణి భారతితో పాటు కుటుంబ సభ్యులు దుబ్బతండాలో ఏర్పాటు చేసిన తండ్రీకొడుకుల విగ్రహాలను రెడ్యానాయక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డోర్నకల్ పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ ఎంపీపీ ధరంసోత్ బాలునాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్, నాయకులు రాయల వెంకటేశ్వర్రావు, నంజాల మధు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.