
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
హన్మకొండ అర్బన్ : రోగులకు అందుబాటు ధరలో మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈమేరకు హనుమకొండ బాలసముద్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తన క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సర్జన్ డాక్టర్ సుధాకర్రెడ్డి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ యాకోబు నాయక్, డాక్టర్ అర్చన, డాక్టర్ స్ఫూర్తిరావు, తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
బాలసముద్రంలో సంకీర్తన ఆస్పత్రి ప్రారంభం