
మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి
డోర్నకల్: మున్సిపాలిటీల పరిధిలో పని చేస్తు న్న మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారి స్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీలా రావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ పరిధిలోని మహిళా సిబ్బందితో పాటు మెప్మా ప్రతినిధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీలారావు మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మెప్మా, మహిళా సిబ్బందికి బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ కేన్సర్, కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి సేకరించిన నమూనాలను ప్రభు త్వ జనరల్ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు తెలిపా రు. మహిళా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి సాధ్విజ, వైద్యులు మేఘన, పృథ్వీ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపైనే పాఠశాల పరిశుభత్ర ఆధారపడి ఉంటుందన్నారు. కేజీబీవీలు బాలికల రెసిడెన్షియల్ అయినందున 24గంటలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థినులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ విజయ కుమారి, ఏఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, డీఆర్పీలు ప్రవీణ్, రజిత, నాగమణి, సుమలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి
కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి