కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

ఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్‌గౌడు, పాలకొలను రమేష్‌, అక్కిమి హనుమంతరెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, గుట్టపాడు రామకృష్ణారెడ్డి, పాలకొలను మద్దయ్య, మాబాషా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement