
నిరుద్యోగ భృతి అమలు చేయాలి
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగమైన కల్పించాలి.. లేదంటే నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నాగరాముడు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిరుద్యోగ భృతిపై పోరాటమనే పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కూట మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డారు. దీనిపై పోరాటా లు ఉద్ధృతం చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్కు అర్జీలు పంపనున్నట్లు తెలిపారు. ఎలాంటి షరతు లు లేకుండా నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ప్రసాద్, రవి, విష్ణు, ఉదయ్కిరణ్, తదితరులు పాల్గొన్నారు.