
ముగిసిన ఉపాధ్యాయుల బదిలీలు
● పదోన్నతులు పొందిన
944 మంది టీచర్లు
● సోమవారం విధులకు హాజరు
కర్నూలు సిటీ: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థ యాజమాన్యాలకు చెందిన స్కూళ్లలో పని చేస్తున్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు సోమవారంతో ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 7,142 మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 5,763 మంది మాన్యువవల్ కౌన్సెలింగ్ ద్వారా ఖాళీలను ఎంపిక చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2)134 మంది, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 406 మంది, స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన క్యాటగిరీకి చెందిన వారు 2,788 మంది, ఎస్జీటీ, తత్సమాన క్యాటగిరి టీచర్లు 2,273 మంది, భాషా పండితులు 1,19 మంది, పీఈటీ 32 మంది, ఆర్ట్,క్రాఫ్ట్, మ్యుజిక్ టీచర్లు 11 మంది బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఆయా మండలాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ అనుకూలమైన స్థానాలు లేవని 1,485 మంది బదిలీలపై ఆసక్తి చూపలేదు. శనివారం శనివారం మధ్యాహ్నానికే ఎస్జీటీల బదిలీ అర్డర్లు వచ్చాయి. అదే రోజు రిలీవ్ అయి..ఆదివారం సెలవైనా బదిలీ అయిన స్కూల్లో రిపోర్ట్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులందరూ సోమవారం కొత్త స్కూళ్లలో విధులకు హాజరయ్యారు.
944 మందికి పదోన్నతులు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన ఆయా క్యాటగిరి టీచర్లకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెచ్ఎంలుగా 141, స్కూల్ అసిస్టెంట్లు(నాన్–లాంగ్వేజ్) 169, స్కూల్ అసిస్టెంట్లు(లాంగ్వేజేస్)గా 12, స్కూల్ అసిస్టెంట్లు(ఫిజికల్ సైన్స్)గా 8, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా 614 మందికి పదోన్నలు పొందారు.