
‘రైతు సేవ’మూత
రైతు సేవాకేంద్రం వద్ద వేచి చూస్తున్న రైతులు
● పెరవలిలో అన్నదాతల ఆందోళన
మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామంలో రైతు సేవా కేంద్రం సోమవారం 12 గంటలయినా తెరుచుకోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వేలిముద్రలు వేయడానికి ఉదయం 8 గంటలకే రైతుసేవా కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం అయినా తాళాలు తీయకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవిషయంపై ఏఓ రవి ప్రశ్నించగా అక్కడ పనిచేస్తున్న అధికారి సెలవుపై వెళ్లడంతో ఆ భాధ్యతలు ఏఈఓకు ఇచ్చామని, మండల ఆఫీస్కు వచ్చి డివైజర్ తీసుకెళ్లడంతో ఆలస్యమయిందన్నారు.