
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
● తొలి రోజు 88.21 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 88.21 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఒక్కొక్కటి, కర్నూలు నగరంలో మూడు.. మొత్తం ఐదు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్లో 762 మందికి 673 హాజరు కాగా 89 మంది గైర్హాజరయ్యారు. 88.32 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం సెషన్లో 756 మందికి 666 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరు కాగా 88.10 శాతం హాజరు నమోదైంది. రెండు సెషన్లలో 88.21 హాజరు శాతం నమోదైంది. జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. డీఎస్సీ పరీక్షలు 30వ తేదీ వరకు జరుగుతాయని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆదేశించారు.

డీఎస్సీ పరీక్షలు ప్రారంభం