ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Jun 15 2025 7:22 AM | Updated on Jun 15 2025 7:22 AM

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్ట్‌

● 38.4 తులాల బంగారు, 32.6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం

బొమ్మలసత్రం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడి 36 కేసుల్లో నిందితులుగాఉన్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మే రకు శనివారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పాతగుంటూరుకు చెందిన పవన్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెకు చెందిన శివశంకర్‌కు గతంలో జైలులో పరిచ యం ఏర్పడింది. అప్పటికే పవన్‌కుమార్‌పై 32 చోరీ కేసులు, శివశంకర్‌కు 21 చోరీ కేసులు పలు ప్రాంతాల్లో నమోదు కాబడ్డాయి. ఇద్దరు కలిసి ఈ ఏడాది నందికొట్కూరు బాలాజీ నగర్‌లో చోరీకి పాల్పడ్డారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసు కున్న జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుల ఆచూకీని కనిపెట్టి శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితులను విచారించగా వారిపై గుంటూ రు, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, ఈస్ట్‌ గోదావరి, రాజమండ్రి, అనంతపురం అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనే కాకుండా తెలంగాణలో కూడా కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి 39.4 తులాల బంగారు ఆభరణాలు, 32.6 తులాల వెండి ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అడిషనల్‌ ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement