
భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!
అమరావతిలో మోదీ సభకు తరలించే జనాలకు భోజన ఖర్చుల భారం పంచాయతీ కార్యదర్శులు భరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జన సమీకరణలో భాగంగా జిల్లాలోని కొన్ని గ్రామాలకు బస్సులను కేటాయించారు. ఆ బస్సుల్లో వెళ్లే జనాలకు భోజనం, మంచినీటి సౌకర్యాలు అన్నీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది. వారి ఖర్చు లకు రూ. 25 వేల వరకు కానుంది. ఈ భారమంతా పంచాయతీ సెక్రటరీలపై పడటంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.