
వివాహితపై హత్యాయత్నం
● నోట్లో మాత్రలు కుక్కి భర్త, మరిది అమానుషం
వెల్దుర్తి: ఓ వివాహితపై భర్త, మరిది హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన షెహనాజ్కు, తడకనపల్లె గ్రామానికి చెందిన మౌలాలికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం కలుగలేదు. మౌలాలి తన తమ్ముడు నాసిర్తో కలిసి ప్రస్తుతం వెల్దుర్తి పట్టణంలోని వడ్డెగేరిలో నివాసముంటున్నారు. గురువారం రాత్రి షెహనాజ్ పరిస్థితి విషమంగా ఉందని ఆమె సోదరి అబ్దుల్లాకు సమాచారం అందడటంతో ఆమెను వెల్దుర్తి సీహెచ్సీకు తరలించాడు. అప్పటికే జ్వరం, కడుపునొప్పి, మోకాళ్ల నొప్పి ఇతరత్రా మందుమాత్రలు 40 వరకు ఆమె తిన్నట్లు తెలుసుకున్న వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం షెహనాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షెహనాజ్ను వదిలించుకోవాలని కుట్రతోనే ఆమె భర్త మౌలాలి, మరిది నాసిర్లు మందుమాత్రలు బలవంతంగా కుక్కి హత్యాయత్నం చేసినట్లు బాధితురాలి అక్క నస్రీన్, బావ సుభాన్, తమ్ముడు అబ్దుల్లా శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షెహనాజ్ భర్త మౌళాలి, మరిది నాసిర్లను స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు.