
రజక విద్యార్థులకు 7న ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్లో అత్యంత ప్రతిభ కనబరిచిన రజక విద్యార్థులకు ఈనెల 7న ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్ తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో పురస్కారాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 10వ తరగతిలో 450, ఇంటర్లో 800 మార్కులకు పైగా, డిగ్రీలో 80 శాతం, బీటెక్లో 80 శాతం ఉత్తీర్ణత సాఽధించిన వారితో పాటు ఎంసెట్, ఇంజనీరింగ్, మెడిసిన్లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు జూలై 31లోగా 9110396511 నెంబర్ను సంప్రందించాలన్నారు. కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ బండారు లింగమయ్య, మహిళా అధ్యక్షురాలు బాపనపల్లి రాధ, న్యాయవాది జగదీష్ తదితరులు పాల్గొన్నారు
కృష్ణానదిలో విద్యార్థి మృతి
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంకు దిగువన కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానిక ఏపీ జెన్కో కార్యాలయ లో పని చేసే ఆశీర్వాదం,కుమారి దంపతుల ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నిఖిల్(17) గుంటూరు జిల్లా పేరేచెర్లలో డిప్లొమో చదువుతున్నాడు. ఇటీవల సున్నిపెంటకు చేరుకున్న విద్యార్థి శనివారం స్నేహితులతో కలసి సరదాగా లింగాలగట్టు బ్రిడ్జి దగ్గర ఈత కొట్టేందుకు వెళ్లారు. కాగా నదిలో ఓ చోట లోతుగా ఉండగా ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం కుటుంబీకులు గాలించగా రాత్రి 8.30 గంటల సమయంలో మృతదేహం లభించగా, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కంచి వర్సిటీలో
నేడు స్పాట్ అడ్మిషన్లు
కర్నూలు కల్చరల్: కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర రావు పేర్కొన్నారు. కర్నూలులోని శంకర మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఖండేరిలోని శంక మందిరంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు 96290 32323, 96290 01144 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

రజక విద్యార్థులకు 7న ప్రతిభా పురస్కారాలు