నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరానికి చెందిన చందన సీతారావమ్మ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన పాములపాటి రాజేశ్వరరావు, శేషరత్నం దంపతులు కుమార్తె, అల్లుడు మణిశ్రీ, రామకృష్ణల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు చేతుల మీదగా దేవస్థానానికి అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.


