రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం

Jun 19 2025 7:58 AM | Updated on Jun 19 2025 7:58 AM

రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం

రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం

కేడీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌

చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేశామని డిజిటల్‌ మాధ్యమాల ద్వారా రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలని కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ అన్నారు. బ్యాంకు కార్యాలయంలో పీఏసీఎస్‌ సిబ్బందికి కంప్యూటరీకరణపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలు కంప్యూటరీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్‌ సేవా కార్యక్రమాలు సహకార సంఘాలకు అనుసంధానించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో మీ–సేవా ద్వారా రైతులకు ఎన్నోరకాల సేవలను అందించేవారన్నారు. ప్రస్తుతం రైతులకు 1బీ, అడంగల్‌ వంటి భూ సంబంధిత పత్రాలను భవిష్యత్తులో సహకార సంఘాల ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేడీసీసీబీ సీఈవో ఎ. శ్యామ్‌మనోహర్‌, జనరల్‌ మేనేజర్‌ బీఎల్‌ చంద్రశేఖర్‌, ఆప్కాబ్‌ ఏజీఎం అశోక్‌, డీపీడీఎంజీ పవన్‌కుమార్‌, పి. జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement