
అన్న చేతిలో తమ్ముడు హతం
కాకరవాయి(వత్సవాయి): కుటుంబ తగాదాల నేపథ్యంలో అన్న చేసిన దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకరవాయి గ్రామానికి చెందిన బెజ్జం ముక్కటి, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న వాడైన అర్జున్కు వివాహం కాలేదు. ముక్కంటి భాగ్యమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాసరావు గతంలో చనిపోయారు. అన్నదమ్ములు కొండ, శ్రీనివాసరావు కుటుంబాలతోపాటు అర్జున్ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. కొండ, అర్జున్ మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం వారి మధ్య వాగ్వాదం జరిగింది. కొండ ఆవేశంతో క్రికెట్ స్టంప్లో తమ్ముడు అర్జున్పై దాడిచేశాడు. అర్జున్ తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో అర్జున్ మరణించాడు. మృతుడి సోదరి రాణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.