
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
చిలకలపూడి(మచిలీపట్నం):అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఉదయం మీకోసం సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖకు చెందిన 12 మందికి కారుణ్య నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. వారిలో 8 మంది జూనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు సచివాలయ కార్యదర్శి, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అందులో టి.మణి, సీహెచ్ గోపాలకష్ణ, ఎస్.అజయ్ బాబు, డి.కిరణ్ కుమార్, ఎ.భరత్ కుమార్, ఎం.చైతన్యకుమార్, వై.అహల్య, సీహెచ్ భవానీశంకర్ జూనియర్ అసిస్టెంట్లుగా, వినోద్ కుమార్ సచివాలయ కార్యదర్శిగా, పి.సుజాత, యు.వెంకటరావులను ఆఫీస్ సబార్డినేట్లుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా డీఆర్ డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డీఎస్ఓ పార్వతి, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, పౌరసరఫరాల సంస్థ డీఎం సీహెచ్ పద్మావతి, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు లోకేష్, నటరాజ్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, డీపీఓ అరుణ, సీపీఓ గణేష్, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ