‘గిరి’ గ్రామాలకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

‘గిరి’ గ్రామాలకు మహర్దశ

Jun 15 2025 8:17 AM | Updated on Jun 15 2025 8:17 AM

‘గిరి’ గ్రామాలకు మహర్దశ

‘గిరి’ గ్రామాలకు మహర్దశ

● ‘పీఎం జుగా’లో మౌలిక సదుపాయాల కల్పన ● ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ● విద్య, జీవనోపాధిలో కీలకమైన మార్పులు ● తొలివిడతలో జిల్లాలో 102 గిరిజన గ్రామాలు ఎంపిక ● 19 శాఖల ద్వారా అభివృద్ధి

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రధాన మంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌గ్రామ్‌ అభియాన్‌(పీఎం జుగా) మిషన్‌ ద్వారా సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.6 శాతం షెడ్యూల్డ్‌ తెగ(ఎస్టీ) ఉంది. ఇతరులతో పోలిస్తే వీరికి విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు నేటికీ అందని ద్రాక్షగా మిగిలాయని అనేక స ర్వేలు, నివేదికలు తేల్చాయి. అందువల్లే సా మాజిక, ఆర్థిక అంతరాలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పీఎం జుగా మిషన్‌ ప్ర వేశపెట్టింది. ఈ మిషన్‌ ద్వారా వెనుకబడిన గి రిజన గ్రామాల్లో అన్నిరకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు.

విద్య, మౌలిక సదుపాయాల కల్పన..

ప్రధానంగా గిరిజన గ్రామాల్లో నివాసాలు లేని వారికి ఇళ్లు, రహదారులు, ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు, ఎల్పీజీ గ్యాస్‌ అందేలా చర్యలు తీసుకుంటారు. సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, పోషణ్‌ వాటికాస్‌, ఆయూష్మాన్‌ కార్డులు అందజేస్తారు. విద్య, నైపుణ్యాలకు దూరంగా ఉంటున్న గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే విద్యుత్‌ సౌకర్యాలకు నోచుకోని గ్రామాలకు విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆన్‌గ్రిడ్‌ పవర్‌ కనెక్షన్లు, ఆఫ్‌గ్రిడ్‌ సోలార్‌ కనెక్షన్లు అందిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలపై రూప్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు జరగనున్నాయి. గిరిజనులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించి, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటారు. కమ్యూనికేషన్‌ మెరుగుపర్చేందుకు 4జీ నెట్‌వర్క్‌ సేవలు ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు

మండలం గ్రామాలు

తిర్యాణి 33

జైనూర్‌ 15

సిర్పూరు(యూ) 14

లింగాపూర్‌ 8

వాంకిడి 8

కెరమెరి 7

ఆసిఫాబాద్‌ 4

బెజ్జూర్‌ 4

కాగజ్‌నగర్‌ 4

చింతలమానెపల్లి 3

కౌటాల 1

రెబ్బెన 1

మిషన్‌ లక్ష్యాలు..

జిల్లాలో గిరిజన జనాభా 500 మంది అంతకంటే ఎక్కువ లేదా కనీసం 50 శా తం అంతకంటే ఎక్కువ గిరిజన నివాసితులు ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం.. విద్య, ఆరోగ్య సంరక్షణ, నై పుణ్యాలను మెరుగుపర్చి గిరిజనుల పు రోగతికి తోడ్పడం ఈ మిషన్‌ లక్ష్యాలు.

ఐదేళ్ల ప్రణాళిక...

జిల్లాలో ఈ మిషన్‌ ద్వారా ఐదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 102 గ్రామాల్లో 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడతారు. సోమవారం నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆ శిబిరాల్లో పాల్గొనే అధికారులు అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సంరక్షణ సదుపాయాలను పరిశీలించి వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత? అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటినీ కలెక్టర్‌ ద్వారా పీఎం జుగా మిషన్‌ అధికారులకు అందజేసిన అనంతరం వెనువెంటనే వాటికి అయ్యే ఖర్చును అందజేస్తారు. అనంతరం ఆయా అభివృద్ధి పనులు చేపడతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తికానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement