
పాఠశాలల్లో సర్వే షురూ
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతోపాటు యూడైస్ ప్లస్ పోర్టల్లో వివరాలు సరిచూసేందుకు జిల్లాలో మంగళవారం నుంచి స ర్వే ప్రారంభమైంది. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 591 పాఠశాలల్లో 61 మంది ఛాత్రోపాధ్యాయులు ఈ నెల 21 వరకు సర్వే చేస్తారని తెలి పారు. తొలిరోజు 126 పాఠశాలల్లో వివరాలు సేకరించామని వెల్లడించారు. గతంలో హెచ్ఎంలు యూడైస్ ప్లస్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా.. లేదా అని పరిశీలించి తప్పులు ఉంటే సరిచేసి కార్యాలయంలో అందజేస్తారని పేర్కొన్నారు.