● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు ● ప్రమాదం జరిగితే డయల్‌ 101కు సమాచారం ఇవ్వాలి ● జిల్లాలో రెండు ఫైర్‌ స్టేషన్లు | - | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు ● ప్రమాదం జరిగితే డయల్‌ 101కు సమాచారం ఇవ్వాలి ● జిల్లాలో రెండు ఫైర్‌ స్టేషన్లు

Apr 14 2025 12:28 AM | Updated on Apr 14 2025 12:28 AM

● నేట

● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● వేసవిలో పొంచి ఉన్న

అప్రమత్తతే రక్షణ

ఎండలు మండిపోతుండటంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తతతోనే ప్రమాదాల సమయంలో ఆస్తులు, ప్రాణాలు రక్షించుకోగలం. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే డయల్‌ 101కు సమాచారం ఇవ్వాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

– భీమయ్య, ఎస్సై, అగ్నిమాపక శాఖ,

కాగజ్‌నగర్‌

కౌటాల(సిర్పూర్‌): వేసవి ప్రారంభమైంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. పొడి వాతావరణంతో ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు కాలి బూడిదవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలి.. ఎలా రక్షించుకోవాలనే విషయాలను ప్రాక్టికల్‌గా డ్రిల్‌ చేసి వివరించనున్నారు.

ప్రమాదాలతో తీవ్ర నష్టాలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏటా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాల్లో మాత్రమే అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లోని మారుమూల మండలాలు, గ్రామాల్లో మంటలు చెలరేగినప్పుడు ఫైరింజన్‌ సకాలంలో చేరడం లేదు. బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. సిర్పూర్‌ నియోజకవర్గంలోని మారుమూల మండలాలైన బెజ్జూర్‌, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాంతోపాటు ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని సిర్పూర్‌(యూ), జైనూర్‌, లింగాపూర్‌, తిర్యాణి వంటి ఏజెన్సీ మండలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే బాధితులు ఆశలు వదులుకోవాల్సిందే. ఫైర్‌స్టేషన్ల నుంచి ఆయా మండలాలు దాదాపు 50 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రమాద స్థలాలకు ఫైరింజన్లు చేరుకోవడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది. నిబంధన ప్రకారం.. ప్రతీ 50 వేల జనాభా కు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు లక్షల మందికి పైనే నివసిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో కనీసం పది అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న రెండు కేంద్రాల భవనాలు కూడా శిథిలాస్థలో ఉంది. సిబ్బంది కొరత సైతం వెంటాడుతోంది. కౌటా ల, కెరమెరి ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని శాఖ అధికారులకు గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు అందించారు.

● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● వేసవిలో పొంచి ఉన్న1
1/1

● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● వేసవిలో పొంచి ఉన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement