లక్ష్యాన్ని చేరలేదు.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని చేరలేదు..

Jun 21 2025 3:37 AM | Updated on Jun 21 2025 3:37 AM

లక్ష్

లక్ష్యాన్ని చేరలేదు..

ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల వారీగా విద్యార్థులు

28–04 20–06 –2024 –2025

1వ తరగతి 5,448 4,724

2వ తరగతి 5,486 6,116

3వ తరగతి 6,361 6,348

4వ తరగతి 7,675 7,103

5వ తరగతి 5,348 7,526

6వ తరగతి 6,820 4,842

7వ తరగతి 7,125 7,158

8వ తరగతి 7,500 6,919

9వ తరగతి 7,433 7,430

10వ తరగతి 7,093 7,388

మొత్తం 66,289 65,554

ఖమ్మం సహకారగనర్‌: ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన భవనాలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడమే కాక విద్యార్థులకు ఉచితంగా విద్య, పాఠ్య, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్‌ అందుతోంది. అలాగే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి మక్కువ చూపడం లేదని తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఈనెల 3నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించారు. అయితే, కార్యక్రమం ముగిశాక నమోదైన ప్రవేశాల ఆధారంగా లెక్కలు వేస్తే గత విద్యాసంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉండడంతో బడిబాట ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది.

735మంది తక్కువ...

గత విద్యాసంవత్సరం ముగిసే నాటికి(ఏప్రిల్‌ 24న) జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు 66,289మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10తరగతి విద్యార్థులు వెళ్లిపోగా, ఇతర పాఠశాలలకు మారిన వారిని కూడా మినహాయించి కనీసం అదే సంఖ్యలోనైనా విద్యార్థులు ఉండేలా ప్రవేశాలకు కృషి చేశారు. కానీ శుక్రవారం గణాంకాలను పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య 65,554మందిగా తేలింది. ఆదిలోనే గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య 735 తక్కువ ఉండగా.. వీరంతా కొనసాగుతారా.. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తే పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు.

సహకారం అందలేదా?

రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. అయితే, చాలా శాఖల అధికారుల నుంచి సహకారం లభించలేదని విద్యాశాఖ వర్గాలు చెబు తున్నాయి. మండల ప్రత్యేక అధికారులు బడిబాట కార్యక్రమానికి నోడల్‌ అధికారులుగా ఉండగా... చాలాచోట్ల పాల్గొనలేదని సమాచారం. తద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది.

ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తక్కువే..

గతేడాదితో పోలిస్తే

పడిపోయిన విద్యార్థుల సంఖ్య

ఆశించిన ఫలితాలు ఇవ్వని ‘బడి బాట’

లక్ష్యసాధనకు కృషి చేస్తాం..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మూతపడిన 12పాఠశాలలు తెరిపించాం. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు నమోదయ్యాయి. అయితే, గతేడాది కంటే విద్యార్థులు తగ్గకుండా మరిన్ని ప్రయత్నాలు చేస్తాం.

– రాజశేఖర్‌, విద్యాశాఖ సీఎంఓ

లక్ష్యాన్ని చేరలేదు..1
1/1

లక్ష్యాన్ని చేరలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement