లోటుపాట్లు ఉండొద్దు.. | - | Sakshi
Sakshi News home page

లోటుపాట్లు ఉండొద్దు..

Jun 19 2025 7:42 AM | Updated on Jun 19 2025 7:42 AM

లోటుప

లోటుపాట్లు ఉండొద్దు..

గురుకులాల్లో

విద్యుత్‌ సంస్థల్లో

సాంకేతిక పరిజ్ఞానం

బోనకల్‌: రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సాగు పనులు ఊపందుకోకముందే పెట్టుబడి సాయం అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. బోనకల్‌ మండలం సీతానగరం సబ్‌స్టేషన్‌లో రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మేనేజ్‌మెంట్‌, ఫాల్ట్‌ పాసేజ్‌ ఇండికేటర్‌ సిస్టమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రియల్‌టైం ఫీడర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం సబ్‌స్టేషన్లలో ఫీడర్ల పర్యవేక్షణ, నియంత్రణ, రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. తొలుత రాష్ట్రంలోని 100సబ్‌స్టేషన్ల ఈ వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. అలాగే, ఫాల్ట్‌ పాసేజ్‌ ఇండికేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాలో అవాంతరం ఎక్కడ ఉందో గుర్తించేందుకు ఉపయోగపడతుందని తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాసాచారి, సీఈ తిరుమల్‌రావు, అధికారులు భద్రూపవర్‌, శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్‌, మనోహర్‌, సాయి, సుందర్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పైడిపల్లి కిశోర్‌కుమార్‌, గాలి దుర్గారావు, మోదుగు సుధీర్‌బాబు పాల్గొన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకులాల నిర్వహణ కొనసాగాలని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్‌ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, జితేష్‌ వి.పాటిల్‌, సీపీ సునీల్‌దత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులాలు, వసతిగృహాల నిర్వహణ, బీసీ సంక్షేమం, రవాణా, ఎకై ్సజ్‌ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, వనమహోత్సవం నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ సరైన వసతులు లేని గురుకులాలను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చాలని, ఎక్కడా దోమల బెడద లేకుండా జాలీలు ఏర్పాటుచేయాలని సూచించారు. కామన్‌ డైట్‌ కచ్చితంగా అమలయ్యేలా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని తెలిపారు. మొక్కలు నాటేందుకు గతంలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని బతికాయో లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈసారి అలాకాకుండా మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. కాగా, బస్సు సర్వీసులు అవసరమైన గ్రామీణ రూట్లపై ప్రతిపాదనలు సమర్పిస్తే నూతన బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు.

ఐఐటీ, నీట్‌ పై శిక్షణ అందించాలి..

గురుకులాల్లో విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరుస్తూ, ఐఐటీ, నీట్‌ల్లో మంచి ఫలితాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. పెరిగిన డైట్‌ చార్జీల ఆధారంగా కామన్‌ డైట్‌ అమలుచేయాలని తెలిపారు. గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించేలా బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ ఏడాది వన మహోత్సవంలో ఈత, తాటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ గీత కార్మికులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు పీఎంఈ స్కీం ద్వారా ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళా సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్‌ పి.నీరజ, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయాలి

అవసరమైన అన్ని ప్రాంతాలకూ

బస్సు సర్వీసులు

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

ఊరికో బస్సు... ఇంటికో దీపం

మధిర: ఊరికో బస్సు... ఇంటికో దీపం అనే నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలో రూ.10కోట్లతో నిర్మించే బస్‌స్టేషన్‌ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్‌ అనుదీప్‌, సీపీ సునీల్‌దత్‌తో కలిసి ఆయన ప్రారంభించాక మాట్లాడారు. 1978లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వాన ఊరికి ఒక బస్సు.. ఇంటికో దీపం నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గత పాలకుల హయాంలో ఆర్టీసీ నష్టపోతే, ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం కృషితో లాభాల బాట పట్టిందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ రూ.6,210 కోట్లను సంస్థకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. కాగా, మహిళా సంఘాల ద్వారా 600 ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అప్పగించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నూతన సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ 1987లో ఆరు బస్సులతో ప్రారంభమైన మధిర బస్టాండ్‌ ఇప్పుడు అత్యాధునిక రూపు సంతరించుకోనుందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా మహిళా సంఘాల ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. అనంతరం కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రారంభించి కొద్దిదూరం ప్రయాణించారు. మధిర మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహారావు, ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ పగిడిమర్రి సోలోమన్‌, ఆర్టీసీ అధికారులు చెరుకుపల్లి వెంకన్న, అజ్మీరా సరిరామ్‌, జోగు భాస్కర్‌, శంకర్‌రారావు తదితరులు పాల్గొన్నారు.

1912కు ఫోన్‌ చేస్తే విద్యుత్‌ సమస్య పరిష్కారం

ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా 2029–30 నాటికి న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యాన రూపొందించిన విద్యుత్‌ అంబులెన్స్‌లను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. 1912 నంబర్‌కు ఫోన్‌ చేస్తే విద్యుత్‌ అంబులెన్స్‌ ద్వారా సిబ్బంది చేరుకుని మరమ్మతులు చేస్తారని భట్టి తెలిపారు. అనంతరం విద్యుత్‌ సిబ్బందికి ఎలక్ట్రికల్‌ సేఫ్టీ టూల్‌ కిట్లు అందజేయగా, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈశిబిరంలో డీఎంహెచ్‌ఓ కళావతిబాయి నేతృత్వాన వైద్యులు చందునాయక్‌, సైదులు, బాలకృష్ణ, చందన తదితరులు 1,217 మందికి పరీక్షలు నిర్వహించారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఏ.సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోటుపాట్లు ఉండొద్దు..1
1/3

లోటుపాట్లు ఉండొద్దు..

లోటుపాట్లు ఉండొద్దు..2
2/3

లోటుపాట్లు ఉండొద్దు..

లోటుపాట్లు ఉండొద్దు..3
3/3

లోటుపాట్లు ఉండొద్దు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement