●వడలిపోతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

●వడలిపోతున్న ఆశలు

Jun 19 2025 7:42 AM | Updated on Jun 19 2025 7:42 AM

●వడలి

●వడలిపోతున్న ఆశలు

ఈసారి ముందుగా రుతుపవనాలు వచ్చేశాయని, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతులు సంతోషించారు. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండలంలో పలువురు రైతులు ఈసారి మిర్చి తగ్గించి పత్త సాగుకు మొగ్గు చూపారు. త్వరగా పత్తి చేతికొస్తే ఆపై మొక్కజొన్న సాగు చేయొచ్చని నిర్ణయం తీసుకున్నారు. గతనెల మూడు, నాలుగో వారాల్లో అడపాడదపా వర్షాలు కురవడంతో పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. కానీ ఆతర్వాత వరుణుడి జాడ లేకపోగా అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతవుతున్నా వర్షం మాత్రం కురవడం లేదు. దీంతో రూ.వేలు వెచ్చించి భూమి సిద్ధం చేయడంతో పాటు విత్తనాలు నాటిన రైతులు ఇప్పుడేం చేయాలో పాలుపోక ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా మండే ఎండలతో అవి వాడిపోతున్నాయి. దీంతో ప్రతిరోజు పొలానికి వెళ్లడం.. వర్షం ఎప్పుడు కురుస్తుందా అని చూడడం.. వడలిపోతున్న మొక్కలను చూసి ఆవేదనగా ఇంటిముఖం పడుతున్న రైతులు పలుచోట్ల కనిపిస్తున్నారు. ఒకవేళ మరో రెండు, మూడు రోజుల్లో వర్షం కురవకపోతే మళ్లీ విత్తనాలు నాటాల్సిందేనని.. తద్వారా రూ.వేలల్లో నష్టం ఎదురవుతుందని ఆవేదన చెందుతున్నారు. – రఘునాథపాలెం

●వడలిపోతున్న ఆశలు1
1/1

●వడలిపోతున్న ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement