
ఓసీలో రక్షణ చర్యలపై ఆరా
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్(ఓసీ)ను బుధవారం సింగరేణి సౌత్ సెంట్రల్జోన్ డిప్యూటీ డీజీఎంఎస్ టీఆర్.కన్నన్ పరిశీలించారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, పీఓ ప్రహ్లాద్తో కలిసి ఓసీ కార్యాలయం, మైనింగ్ ప్లాన్, వ్యూ పాయింట్ను పరిశీలించిన ఆయన పలు వివరాలు ఆరా తీశారు. బొగ్గు వెలికితీత సమయాన గనులతో పాటు కార్మికుల రక్షణ చర్యలపై ఆరా తీశారు. అనంతరం అధికారులు వ్యూ పాయింట్ వద్ద మొక్కలు నాటారు. వివిధ విభాగాల అధికారులు అశోక్కుమార్, ఆనందవేల్, దిలీప్కుమార్, కమలేష్కుమార్ వర్మ, చింతల శ్రీనివాసరావు, తివారీ, సూర్యనారాయణరాజు, వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, గోవింద్, అభిలాష్, దేవదాస్ పాల్గొన్నారు.