
ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలగాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థానాలకు చేరాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ నార్సింగ్ షైలానీ సూచించారు. ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లోని ఎన్సీసీయూనిట్ను బుధవారం పరిశీలించిన ఆయ న కేడెట్లతో మాట్లాడారు. కేడెట్లు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని తెలిపారు. భారత ఆర్మీలో చేపట్టే ఎంపీకల్లో ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక కోటాఉంటుందని చెప్పారు. అనంతరం గ్రూప్ కమాండర్కల్నల్, వీరచక్ర అవార్డు గ్రహీత సచిన్ నింబాల్కర్, ఏడీ (పర్సనల్) కల్నల్ సంజీవ్కుమార్,11వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, హార్వెస్ట్ కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డితో పాటు జి.బాలకృష్ణ, మమత, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలోని 11వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ను నర్సింగ్ షైలానీ తదితరులు సందర్శించి వివరాలు ఆరా తీశారు.