
సాగర్ కెనాళ్ల మరమ్మతులు చేపట్టాలి
ఖమ్మంమామిళ్లగూడెం: వానాకాలం పంటల సాగు సీజన్ మొదలైనందున సాగర్ ఆయకట్టు వరకు నీరు అందేలా అవసరమైన మరమ్మతులు చేపట్టా లని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించగా, సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. ఐదు దశాబ్దాల కిందట సాగర్ ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టారని, ఆ తర్వాత కాల్వల్లో అవాంతరాలు, చెట్లు పెరగడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇకనైనా మరమ్మతులు చేయడంతో పాటు అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్, నాయకులు చింతనిప్పు చలపతిరావు, గుడ్డూరి ఉమ, తూళ్లూరు రమేశ్, ఉపేందర్, రామారావు, భాస్కర్రావు, రామకృష్ణ, వీరభద్రం, మధు, వెంకట్రావు, అప్పారావు, శ్రీను, ఆనందరావు, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.