
మానవత్వంతో ఆర్థిక సాయం
తల్లాడ: తల్లాడ మండలం మిట్టపల్లిలో గత నెల గ్యాస్ సిలిండర్ పేలగా ఒకే కుటుంబానికి చెందిన కవల పిల్లలు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో బాలుర తండ్రి గుత్తికొండ వినోద్ కూడా గాయపడగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మండల విద్యాశాఖ ఆధ్వర్యాన సేకరించిన రూ.50 వేల నగదును బుధవారం ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్ చేతుల మీదుగా ఆయనకు అందజేశారు. తొలుత విరాళాల రూపంలో సమకూరిన రూ.61 వేల నగదును వినోద్కు అందించారు. కానీ, ఆయన మొత్తం నగదు తీసుకోకుండా తన కుమారులు చదివిన మిట్టపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి కోసం రూ.11 వేలు వెచ్చించాలని కోరాడు. ఈ మేరకు పిల్లలకు ఆ నగదుతో బ్యాగ్లు, ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాయల నరసింహారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.