
ఒకరు ఐపీఎస్, ఇంకొకరు సీఐ
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడలోని పేద కుటుంబానికి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. చిన్నప్పటి నుండి కృష్ణయ్య పేదరికాన్ని అనుభవించారు. భీమవరంలోని పలువురు రైతుల వద్ద ఏటా రూ.3వేల జీతానికి పనిచేశాడు. ఆయన భార్య వజ్రమ్మ కూడా కూలీ పనులకు వెళ్లేది. అయినా రూపాయి రూపాయి పోగేసి పిల్లలు శ్రద్ధగా చదువుకునేలా చూశారు. తద్వారా ఓ కుమారుడు బాబురావు రామగుండం సీసీఎస్లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్న కుమారుడు కిరణ్కుమార్ ఐపీఎస్ సాధించి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రోహఽథాస్ జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆది నుంచి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు బిడ్డలు ఉన్నత స్థాయికి చేరడంతో కృష్ణయ్య దంపతులు ఆనందంలో ఉండగా.. స్థానికులు వారి కృషిని అభినందిస్తున్నారు.