
ఎంవీఐగా రైతు బిడ్డ
వైరా: తన కష్టం బిడ్డలు పడొద్దని తపించే వారిలో ఆచంట రామకృష్ణ ఒకరు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన ఆయనకు ఐదెకరాల భూమి ఉంది. రామకృష్ణకు కుమారులు వరప్రసాద్, సురేష్ ఉండగా, బిడ్డలు మంచి ఉద్యోగాలు చేసి పేరు సాధించాలని భావించేవాడు. ఈక్రమంలోనే వరప్రసాద్ను బీటెక్ వరకు చదివించగా ప్రస్తుతం వైరా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సురేష్ చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ‘కష్టపడండి.. ఉన్నత ఉద్యోగాలు చేయండి.. పది మందికి సాయపడండి..’ అని చెప్పే తండ్రి మాటలే తమకు ఆదర్శమని వరప్రసాద్ చెబుతారు.